6 June, 2026 | 6:33 PM

Breaking News

గ్రామసభలను పకడ్బందీగా నిర్వహించాలి: ఐటిడిఏ ప్రాజెక్ట్ అధికారి   •   లింగారెడ్డిగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం   •   ప్రణాళికాబద్ధంగా కార్పొరేషన్‌ను అభివృద్ధి చేసుకుందాం   •   ఫార్మర్ రిజిస్టీ తప్పని సరి   •   వన్యప్రాణులు, పక్షుల సంరక్షణలో ప్రజల భాగస్వామ్యం కీలకం   •   కాంగ్రెస్ పార్టీలో చేరిన రాఘవపల్లి గ్రామ సర్పంచ్, పాలకవర్గం   •   కొమ్ముగూడెం పంచాయతీలో సర్పంచ్ సోయం సత్యవతి అధ్యక్షతన గ్రామ సభ   •   ఆలిండియా పోలీస్ స్పోర్ట్స్ మీట్‌లో బ్రాంజ్ మెడల్ సాధించిన కానిస్టేబుల్ శ్రీలత   •   గ్రామ సమస్యల పరిష్కారానికి ప్రజలు అవగాహన కలిగి ఉండాలి   •   కోల్‌కతా మెట్రోలో ప్రయాణించిన కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్‌   •  

42 శాతం రిజర్వేషన్లు ప్రకటించేంత వరకు పోరాటం..

25-11-2025 10:29 PM

కలెక్టరేట్ ఎదుట బీసీ సంఘాల ఆందోళన..

ఆదిలాబాద్ (విజయక్రాంతి): కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించాలని జిల్లా బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు చిక్కాల దత్తు డిమాండ్ చేశారు. రిజర్వేషన్లు ప్రకటించేంత వరకు తమ పోరాటం కొనసాగుతుందన్నారు. ఈ విషయమై మంగళవారం ఆదిలాబాద్ కలెక్టరేట్ ఎదుట బీసీల పోరాట దీక్ష చేపట్టారు. బీసీలకు విద్యా, ఉద్యోగ, రాజకీయ రంగాలలో 42 శాతం రిజర్వేషన్లు పెంచడానికి పార్లమెంట్లో రాజ్యాంగ సవరణ చేసి, 9వ షెడ్యూల్లో చేర్చాలని అద్యక్షుడు దత్తు డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలను మోసం చేస్తుందని పేర్కొన్నారు. ఈ నిరసన కార్యక్రమంలో సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కలాల శ్రీనివాస్, గౌరవాధ్యక్షులు నర్సాగౌడ్, నాయకుల అంజు, అశోక్, శివయ్య, విజయ్, మహిళా నాయకులు తదితరులు పాల్గొన్నారు.