26 May, 2026 | 4:24 PM

Breaking News

ప్రభుత్వ ఏర్పడ్డ రెండు సంవత్సరాలకె ఆడ బిడ్డలు రోడ్డెక్కే పరిస్థితి ఏర్పడినది   •   బాల్యవివాహాలను నిర్మూలించాలి   •   మంథనిలో రేపు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సమీక్ష సమావేశం విజయవంతం చేయాలి   •   కొనుగోలు కేంద్రం ప్రారంభించిన తాసిల్దార్   •   వర్షాకాలం ప్రారంభంలోగా పనులు పూర్తి చేయాలి   •   కోమాలో ఉన్న లాలును పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే తాటి   •   క్యాన్సర్ ను ప్రారంభ దశలో గుర్తించి శస్త్రచికిత్స చేస్తే.. ప్రమాదాలు తగ్గించవచ్చు..   •   పెరిగిన ధరలకు అనుగుణంగా కార్మికుల వేతనాలు పెంచాలి: సీఐటీయూ   •   గుడిసె వాసుల జాబితాను సిద్ధం చేయండి: ఎంపీడీవో   •   వైభవంగా అయ్యప్ప స్వామి పుట్టినరోజు వేడుకలు   •  

42 శాతం రిజర్వేషన్లతోనే స్థానిక ఎన్నికలు

09-10-2025 01:11 AM

బస్ భవన్‌పై రాజకీయం చేయవద్దని బీఆర్‌ఎస్‌కు మంత్రి పొన్నం హితవు 

హైదరాబాద్, అక్టోబర్ 8 (విజయక్రాంతి): బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలుపై ప్రభుత్వం తరఫున తమ వాదనలు బలంగా వినిపించామని, దేశంలో తొలి రాష్ర్టంగా 42 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తూ ఎన్నికలకు వెళ్తున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. బుధవారం గాంధీభవన్‌లో మాట్లాడుతూ.. రాజకీయాలు పక్కన పెట్టి అసెంబ్లీలో ఏకగ్రీవంగా మద్దతు తెలిపినట్టు కోర్టులో బీజేపీ, బీఆర్‌ఎస్, బీజేపీ, ఎంఐఎం ఇంప్లీడ్ కావాలని కోరారు.

ఆర్టీసీ నష్టాల నుంచి లాభా ల్లోకి తీసుకొస్తున్నామని చెప్పారు. ఎలక్ట్రిక్ బస్సులు నడపాలంటే డిపోలో స్టేషన్‌కు రూ.10 కోట్లు ఖర్చు అవుతుందన్నారు. 2019లో ఆర్టీసీ కార్మికులు 55 రోజులపాటు సమ్మె చేస్తే  ఉక్కుపాదం మోపారని, ఇప్పు డు చలో బస్ భవన్ అనడం హాస్యాస్పదం గా ఉందన్నారు. బస్ భవన్‌పై రాజకీ యం చేయవద్దని బీఆర్‌ఎస్‌కు హితవుపలికారు.