15 April, 2026 | 11:56 AM

Breaking News

ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •   అంబేద్కర్ భారత రాజ్యాంగ శిల్పి   •  

లోక్ అదాలత్‌కు విశేష స్పందన

22-12-2025 12:00 AM

1677 క్రిమినల్, 18 సివిల్ కేసుల పరిష్కారం

సిద్దిపేట క్రైం, డిసెంబర్ 21 : జాతీయ లోక్ అదాలత్ లో 1677 క్రిమినల్, 18 సివిల్ కేసులు పరిష్కరించినట్టు న్యాయ సేవాధికార సంస్థ చైర్పర్సన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి కె.సాయిరమాదేవి తెలిపారు. జాతీయ, రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థల ఆదేశానుసారం సిద్దిపేట జిల్లా కోర్టు ఆవరణలో ఆదివారం నిర్వహించిన లోక్ అదాలత్ ను సాయిరమాదేవితోపాటు న్యాయమూర్తి ఎన్.సంతోష్ కుమార్ ప్రారంభించారు. రాజీకి అవకాశం ఉన్న కేసులను ఇరు వర్గాల మధ్య సామరస్యపూర్వకంగా పరిష్కరించారు.

1677 క్రిమినల్, 18 సివిల్, 16 మోటారు ప్రమాద కేసుల్లో రూ.1,34,75,000 పరిహారం ప్రకటించారు. 67 బ్యాంకు కేసులను పరిష్కరించి రూ.26,97,267 పరిహారం అందజేసేందుకు ఉత్తర్వులు జారీ చేశారు. అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి తరణి, ఫస్ట్ క్లాసు మేజిస్ట్రేట్ కాంతారావు, బార్ అసోసియేషన్ సెక్రటరీ రమేష్, న్యాయవాదులు, న్యాయసేవా సంస్థ సిబ్బంది పాల్గొన్నారు.