15 April, 2026 | 1:40 PM

Breaking News

మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిపై దాడి   •   అక్రమాలు ప్రశ్నిస్తే కక్ష కట్టారు   •   ఎక్సైజ్ కోర్టు కానిస్టేబుల్ కు ఘనంగా వీడ్కోలు   •   ట్రాక్టర్ డీకొని బాలుడికి తీవ్రగాయాలు   •   గ్రామీణ అభివృద్ధితో ప్రజల జీవన ప్రమాణాల పెంపు లక్ష్యం   •   టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యుడుగా షాద్‌నగర్ మాజీ ఎమ్మెల్యే బక్కని నరసింహులు   •   మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •  

ప్రేమించిన అమ్మాయి మోసం చేసిందని వ్యక్తి ఆత్మహత్య

22-12-2025 12:00 AM

ధర్మపురి, డిసెంబర్ 21(విజయక్రాంతి): ప్రేమించిన అమ్మాయి మోసం చేసిందనీ, జీవితం మీద విరక్తితో యువకుడు ఆత్మహత్య చేసుకున్నట్లు ధర్మపురి ఎస్త్స్ర మహేష్ ఒక ప్రకటనలో తెలిపారు. ఎస్త్స్ర తెలిపిన వివరాల ప్రకారం ధర్మపురి మండలం రామయ్య పల్లి గ్రామానికి చెందిన కల్ల నవీన్ (24)అనే యువకుడు రెండు సంవత్సరాలు ఉద్యోగ నిమిత్తం దుబాయ్ వెళ్ళినాడు. అక్కడి నుంచి తిరిగి వచ్చి హైదరాబాదులో పని చేసుకుంటున్నాడు.

పది రోజుల క్రితం ఇంటికి వచ్చి ఇంట్లోనే ఉంటున్నాడు.అతడు అదే గ్రామానికి చెందిన ఒక అమ్మాయిని ప్రేమించాడు. ఆ అమ్మాయి పెళ్లి చేసుకోవడానికి నిరాకరిస్తుందని ఎప్పుడూ బాధపడుతూ ఉండేవాడు. ఈ నెల 20వ తేదీ శనివారం రోజున ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి ఇంటి దూలానికి చీరతో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి తల్లి కరుణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్త్స్ర మహేష్ తెలిపారు.