26-09-2025 06:13:12 PM
మహబూబ్ నగర్: జిల్లా మిడ్జిల్ మండల ఇంచార్జ్ తహసిల్దార్ గా ఎం.భారతి శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. మిడ్జిల్ తహసిల్దార్ రాజు అనారోగ్య కారణంతో సెలవుపై వెళ్లినందున రాజాపూర్ మండల డిప్యూటీ తహసిల్దార్ ఏం.భారతిని జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి మిడ్జిల్ ఇన్చార్జి తహసిల్దారుగా ఉత్తర్వులు జారీ చేశారు.