calender_icon.png 8 June, 2025 | 3:16 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మంత్రివర్గంలో అవకాశం కల్పించాలని విజ్ఞప్తి

07-06-2025 08:56:25 PM

హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)ని జూబ్లీహిల్స్ లోని ఆయన నివాసంలో పలువురు మాదిగ సామాజికవర్గం ఎమ్మెల్యేలు(Madiga Community MLAs) మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్ర మంత్రివర్గంలో మాదిగ సామాజికవర్గానికి అవకాశం కనిపించాలని విజ్ఞప్తి చేశారు. ఇంతకు ముందే వీరంతా ఢిల్లీలోని ఏఐసీసీ నేతలను(AICC Leaders) కలిసి ఎస్సీ వర్గానికి చెందని ఎమ్మెల్యేలకు కేబినెట్ లో అవకాశం కల్పించాలని కోరారు. ఇవాళ సీఎం రేవంత్ ను కూడా హైదరాబాద్ లో ఇదే అంశంపై మళ్లీ విజ్ఞప్తి చేశారు. ముఖ్యమంత్రిని కలిసిన వారిలో ధర్మపురి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్, మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ , నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, చేవేళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య ఉన్నారు.