13 April, 2026 | 11:51 AM

Breaking News

మండల ప్రజల సమస్యలు త్వరితగతిన పరిష్కరించండి   •   నోయిడా కార్మికుల నిరసన హింసాత్మకం... వాహనాలకు నిప్పు   •   గ్రామీణ వైద్యులకు షోకాజ్ నోటీసులు జారీ   •   నెట్‌వర్కింగ్ మార్కెటింగ్ ఒత్తిడి: యువకుడి ఆత్మహత్య   •   బాణసంచా కర్మాగారంలో భారీ పేలుడు; కార్మికులు చిక్కుకున్నట్లు అనుమానం?   •   గుజరాత్‌లో ఘోర రోడ్డుప్రమాదం: ట్రక్కు ఢీకొని ఏడుగురు దుర్మరణం   •   కొల్కూర్ గ్రామంలో తొలిసారి క్రికెట్ టోర్నమెంట్ నిర్వహణ   •   ఇంటర్ ఫలితాల్లో రిషి విద్యార్థుల ర్యాంకుల పంట   •   మంత్రి తుమ్మలను కలిసిన మున్సిపల్ వైస్ చైర్మన్, కౌన్సిలర్లు   •   రెడ్డిపల్లి కార్బన్ రిసోర్సస్ సంస్థ వివాదం – హైకోర్టు ఆదేశాలు, అధికారుల అడ్డంకులు   •  

దేశవ్యాప్త సన్యాన్ జయప్రదం చేయండి

12-01-2026 07:32 PM

మునుగోడు,(విజయక్రాంతి): కేంద్ర ప్రభుత్వం కార్మికులకు వ్యతిరేకంగా  తీసుకువచ్చిన నాలుగు లేబర్ కోర్సులు రద్దు చేయాలని ఫిబ్రవరి 12న నిర్వహించనున్న దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని సిఐటియు మండల కన్వీనర్ వరికుప్పల ముత్యాలు కోరారు. సోమవారం మునుగోడు మండల కేంద్రంలోని అమరవీరుల స్మారక భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్ర బిజెపి ప్రభుత్వం అమలు చేస్తున్న కార్మిక రైతు , వ్యవసాయ కూలీలకు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఫిబ్రవరి 12న జరిగే దేశవ్యాప్త ఉద్యమంలో కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. జనవరి 18 వరకు లేబర్ కోడ్స్ విబి రామ్ జీ  చట్టం జాతీయ విత్తన బిల్లు , విద్యుత్ సవరణ బిల్లు రద్దు కోరుతూ చేపట్టిన పోరాటాలు నిర్వహించేందుకు ప్రతి ఒక్కరు పాల్గొనాలని కోరారు . ఈ కార్యక్రమంలో ప్రజాసంఘాల నాయకులు పగిళ్ల మధు , కట్ట లింగస్వామి , సింగపంగ నరేష్  ఉన్నారు.