26 April, 2026 | 11:18 PM

Breaking News

కార్యకర్త కుటుంబానికి ఆర్థిక సాయం అందించిన జిల్లా అధ్యక్షురాలు పద్మ దేవేందర్ రెడ్డి   •   శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో పూజలు చేసిన మాజీ ఎమ్మెల్యే కందాళ   •   ఘనంగా వాసవి మాత జయంతి వేడుకలు   •   నిరుద్యోగ సమస్యలను పరిష్కారించటంలో కేంద్ర, రాష్ట్ర, ప్రభుత్వాలు విఫలం   •   కొత్త కలెక్టర్ కు స్వాగతం   •   ఖాకీలపై నాయీల నిరసనల వెల్లువ   •   శ్రీ వాసవి మాత అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలి   •   డీజిల్ పెట్రోల్ కొరత లేకుండా చూడాలి: సిపిఐ డిమాండ్   •   ప్రధానమంత్రి మన్ కీ బాత్ కార్యక్రమాన్ని వీక్షించిన బిజెపి నేతలు   •   ఖానాపూర్ మున్సిపాలిటీకి ఉపాధి పనులు పునరుద్ధరించండి   •  

ఎస్సీ వర్గీకరణపై మాలల నిరసన

12-08-2024 12:00 AM

సుంకిడి గ్రామంలో రాస్తారోకో

ఆదిలాబాద్, ఆగస్టు 11 (విజయక్రాంతి): ఎస్సీ వర్గీకరణ చేపట్టాలని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై మాలల కులస్థులు భగ్గుమంటున్నారు. ఆదివారం ఆదిలాబాద్ జిల్లా  తలమడుగు మండలంలోని సుంకిడి గ్రామ లో మాల సంక్షేమ సంఘం ఆధర్యంలో అంతర్ రాష్ర్ట రహదారిపై బైఠాయించి, రాస్తారోకో చేపట్టారు. అంతకుముందు ర్యా లీగా వచ్చి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని ఆందోళనకారులను సముదాయించారు.

ఈ సందర్భంగా మాల సంఘం మండలాధ్యక్షుడు గుకుంటి క్రాంతికుమార్ మాట్లాడుతూ.. ఎస్సీ వర్గీకరణతో అన్నదమ్ములుగా ఉన్న మాల, మాదిగలు విడిపోయే ప్రమాదం ఉందన్నారు. వర్గీకరణపై పునరాలోచించాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో మాల సంఘం నాయకులు ముల్కల రాజేశర్, మగ్గిడి ప్రకాశ్, గడుగు పొచన్న, నిమ్మల గజానన్, నర్సిములు, దేవన్న, దిలీప్ పాల్గొన్నారు.