22 June, 2026 | 7:29 PM

Breaking News

వీబీజీ రాంజీ చట్టంతో కూలీలకు ఉపాధి అవకాశాలు తగ్గిపోతాయి   •   పెన్షనర్స్ సమస్యల పట్ల ప్రభుత్వం అలసత్వం విడాలి   •   అనురాగ్ లో వ్యవసాయ పారిశ్రామిక అభివృద్ధిపై డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్   •   డ్రగ్స్ పై విద్యార్థులకు అవగాహన   •   దమ్మపేట మండలంలో బీఆర్ఎస్ పార్టీకి గట్టి షాక్   •   శభాష్... సర్పంచ్ సాబ్   •   డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణానికి యువత ముందుకు రావాలి   •   ప్రజావాణిలో 125 దరఖాస్తులు స్వీకరణ   •   ప్రజావాణి దరఖాస్తులు త్వరగా పరిష్కరించాలి   •   అక్షరాభ్యాస కార్యక్రమంలో పాల్గొన్న కౌన్సిలర్ పాటి పావని జగన్మోహన్ రెడ్డి విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం   •  

ఆలేటి లింగమ్మ దశదినకర్మకు మంద కృష్ణ మాదిగ హాజరు

30-10-2025 06:57 PM

నకిరేకల్ (విజయక్రాంతి): పవన్ సాయి హాస్పిటల్ అధినేత డా. అలేటి శ్రీనివాస్ గౌడ్ మాతృమూర్తి ఆలేటీ లింగమ్మ దశదినకర్మ కార్యక్రమం గురువారం శాలిగౌరారం మండల కేంద్రంలోని జీబిఎం గార్డెన్ లో జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ లింగమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. వారి వెంట ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ గోవిందు నరేష్, రాష్ట్ర ఉపాధ్యక్షులు బోడ సునీల్, ఎంఎస్పి రాష్ట్ర నాయకులు మేడి శంకర్, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎరసాని గోపాల్, శాలిగౌరారం మండల ఇన్చార్జి కారుపాటి అంబేద్కర్, బట్ట శ్రీను, మాచర్ల ప్రతాప్, బాకీ వెంకన్న, బోడ వినోద్ తదితరులున్నారు.