31 August, 2026 | 6:04 PM

Breaking News

అంధత్వాన్ని నివారించాలి: అదనపు కలెక్టర్ విక్టర్   •   చిరుతపులి సంచారం... వెంకంపల్లి గ్రామస్తులు ఆందోళన   •   పర్యావరణం పరిరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత   •   ప్రజా ప్రభుత్వంతోనే గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి   •   అభివృద్ధిలో కరీంనగర్‎ను ఆదర్శంగా తీర్చిదిద్దుతాం: బండి సంజయ్   •   శ్రీ పెద్దమ్మ తల్లి ఆశీస్సులతో అందరూ సుభిక్షంగా ఉండాలి   •   రైల్వే హబ్ గా గద్వాల జిల్లా అభివృద్ధి: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.   •   మాజీ ఎంపీపీను పరామర్శించిన ముత్తారం కళాశాల అధ్యాపకులు   •   కొండపోచమ్మ ఆలయ నూతన ఈఓగా ముసినం మైసయ్య   •   అలంపూర్ అభివృద్ధికి కేంద్రం ప్రత్యేక దృష్టి   •  

ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు పరిశీలన

31-07-2025 08:36 PM

సంస్థాన్ నారాయణపూర్,(విజయక్రాంతి): సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను మండల స్పెషల్ ఆఫీసర్ జయశ్రీ పరిశీలించారు. గురువారం నారాయణపురం మండలం ఎంపీడీవో ప్రమోద్ కుమార్ తో కలిసి ఇందిరమ్మ ఇండ్లను పరిశీలించి ఇండ్లు నిర్మించుకుంటున్న లబ్ధిదారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. అనంతరం ఎంపీడీవో ఆఫీసులో అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో ఎలాంటి అవకతవకలు జరిగిన సహించేది లేదని అన్నారు.