21 August, 2026 | 12:12 PM

Breaking News

వేం నరేందర్ రెడ్డిని కలిసిన కాంగ్రెస్ మండల అధ్యక్షులు   •   ఒకే విగ్రహం.. రెండు నివాళులు..! కాంగ్రెస్‌లో మళ్లీ వేడెక్కిన చర్చ   •   కేసముద్రంలో పాలిటెక్నిక్ విద్యార్థుల రాస్తారోకో   •   హెచ్.సి.యూలో సీటు సాధించిన విద్యార్థినిని సన్మానించిన సర్పంచ్   •   ఇందిరమ్మ ఇండ్ల సర్వే పేరుతో లబ్ధిదారుల్ని తికమక పెట్టదు   •   అమెరికా పర్యటన కొనసాగించండి... అధికారులకు సీఎం రేవంత్ ఆదేశం   •   హైదరాబాద్‎కు మాజీ సీఎం జగన్.. భారీగా వెలిసిన కటౌట్లు   •   వరలక్ష్మీ వ్రతం పూజా విధానం, తోరం కట్టే సంప్రదాయం ఇదే!   •   క్షేత్రస్థాయిలోనే భూ సమస్యలకు పరిష్కారం   •   రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనకు కేంద్రం నో   •  

జాతీయస్థాయి ఫుట్‌బాల్‌ పోటీలకు మణిదీప్ ఎంపిక

29-09-2025 08:01 PM

మందమర్రి (విజయక్రాంతి): ఇటీవల జనగామలో జరిగిన రాష్ట్రస్థాయి ఫుట్‌బాల్‌ పోటీల్లో పట్టణంలోని తెలంగాణ మోడల్ జూనియర్ కాలేజ్ విద్యార్థి పి.మణిదీప్ అత్యంత ప్రతిభ కనబరిచి జాతీయ స్థాయి ఫుట్‌బాల్‌ పోటీలకు ఎంపికయ్యారని జిల్లా డీఐఈఓ కే అంజయ్య తెలిపారు. జాతీయస్థాయి పోటీలకు ఎంపికైన విద్యార్థిని సోమవారం ఆయన అభినందించి మాట్లాడారు పట్టణంలోని మోడల్ కాలేజీలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న మణిదీప్ ఫుట్‌బాల్‌ పోటీలో అత్యంత ప్రతిభ కనబరిచి జిల్లాకు పేరు ప్రఖ్యాతలు తీసుకొచ్చారన్నారు. అక్టోబర్ 2 నుండి 12వ తేదీ వరకు శ్రీనగర్ లో జరిగే జాతీయ స్థాయి పోటీల్లో ప్రతిభ కనబరిచి జిల్లాకు, కాలేజీకి పేరు తీసుకురావాలని కోరారు. కాగా రాష్ట్ర స్థాయి జట్టుకు కోచ్ గా గాలిపెళ్లి సురేందర్ వ్యవహరించనున్నారు. జాతీయస్థాయి పోటీలకు ఎంపికైన మణిదీప్ ను ఒలింపిక్ అసోసియేషన్, ఫుట్ బాల్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి పిన్నింటి రఘునాథరెడ్డి, ఎస్జిఎఫ్ జిల్లా కార్యదర్శి బాబురావులు అభినందించారు.