25-08-2025 04:38:03 PM
సిపిఐ మరిపెడ మండల కార్యదర్శి మారగాని బాలకృష్ణ
మరిపెడ,(విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం సిపిఐ పార్టీ మాజీ జాతీయ ప్రధాన కార్యదర్శి మాజీ పార్లమెంట్ సభ్యుడు సుధాకర్ రెడ్డి మృతి తీరని లోటు అని సుధాకర్ రెడ్డి మృతికి సిపిఐ మరిపెడ మండలం సహాయ కార్యదర్శి ఎండి అబ్దుల్ రషీద్ అధ్యక్షత సిపిఐ మరిపెడ మండల సమితి తరపున సుధాకర్ రెడ్డి మృతికి శ్రద్ధాంజలి ఘటించడం జరిగింది సురవరం సుధాకర్ రెడ్డి విద్యార్థి దశ నుండి ఏఐఎస్ఎఫ్ ఏవైఎస్ఎఫ్ నుండి అంచలంచెలుగా జాతీయ ప్రధాన కార్యదర్శి స్థాయికి ఎదిగి పేదల పక్షాన నిరంతరం ప్రజా ఉద్యమాలపై గల మెచ్చిన నేత మృతి ఈ లోకానికి వామపక్ష కమ్యూనిస్టు పార్టీలకు సిపిఐ పార్టీకి తీరనిలోటని సురావరం సుధాకర్ రెడ్డి ఆశయాలను ఆయన లక్ష్యాలను సిపిఐ పార్టీ ముందుకు తీసుకెళ్తుందని ఈ సందర్భంగా తెలియజేయడం జరిగింది.