6 June, 2026 | 6:00 PM

Breaking News

వన్యప్రాణులు, పక్షుల సంరక్షణలో ప్రజల భాగస్వామ్యం కీలకం   •   కాంగ్రెస్ పార్టీలో చేరిన రాఘవపల్లి గ్రామ సర్పంచ్, పాలకవర్గం   •   కొమ్ముగూడెం పంచాయతీలో సర్పంచ్ సోయం సత్యవతి అధ్యక్షతన గ్రామ సభ   •   ఆలిండియా పోలీస్ స్పోర్ట్స్ మీట్‌లో బ్రాంజ్ మెడల్ సాధించిన కానిస్టేబుల్ శ్రీలత   •   గ్రామ సమస్యల పరిష్కారానికి ప్రజలు అవగాహన కలిగి ఉండాలి   •   కోల్‌కతా మెట్రోలో ప్రయాణించిన కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్‌   •   'ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక' ముగింపు కార్యాచరణ   •   అశ్వాపురం ప్రధాన రహదారిపై డివైడర్లు, సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేయాలి   •   ప్రజల భాగస్వామ్యంతో సమగ్ర అభివృద్ధికి కృషి చేయాలి   •   చర్లలో ఘనంగా ఎంపీ బలరాం నాయక్ జన్మదిన వేడుకలు   •  

తాళం వేసిన ఇంట్లో భారీ చోరీ

05-11-2025 12:53 AM
  1. ఆరున్నర తులాల బంగారు నగలు, 

రెండున్నర కిలోల వెండి అభరణాలు,

రూ. 2.50 లక్షల నగదు చోరీ చేసిన దుండగులు 

కామారెడ్డి, నవంబర్ 4, (విజయక్రాంతి): బంధువుల ఇంటికి వెళ్లిన పాపానికి తాళం వేసిన ఇంట్లో గుర్తు తెలియని దుండగులు చొరబడి ఇల్లును గుల్ల చేసిన సంఘటన కామారెడ్డి జిల్లా కేంద్రంలోని దేవునిపల్లిలో చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. ఈ భారీ చోరీ పోలీసులను కలవరానికి గురిచేస్తుంది. దేవునిపల్లి శివారులోని మెడికల్ కళాశాల సమీపంలో నివాసముంటున్న చంద్రమోహన్ రెడ్డి తన కుటుంబ సభ్యులతో కలిసి ఇంటికి తాళం వేసి బంధువుల ఇంటికి వెళ్ళాడు.

మంగళవారం ఉదయం వచ్చి చూసే సరికి ఇంటి తాళాలు పగలగొట్టి ఉన్నాయి. ఇంట్లోని బీరువాలో ఉన్న ఆరున్నర తులాల బంగారు నగలు, రెండున్నర కిలోల వెండి నగలు, రూ. 2.50 లక్షల నగదు చోరీకి గురయ్యాయి. బాధితుడు దేవునిపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దేవునిపల్లి ఎస్త్స్ర భువనేశ్వర్ సంఘటన స్థలానికి చేరుకొని వివరాలు తెలుసుకున్నారు. క్లోస్ టీమ్ ను రప్పించి ఆధారాలు సేకరించారు.

దొంగలను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. సీసీ కెమెరాలు లను పరిశీలిస్తున్నారు. ఇతర రాష్ట్రాల కు చెందిన దొంగల ముఠా పని అయి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. జిల్లా కేంద్రంలో భారీ చోరీ జరగడం పోలీసులకు సవాలు విసిరినట్లు అయింది.