17 April, 2026 | 3:19 PM

Breaking News

ఫిల్మ్‌నగర్‌లో ఆయమ్మ దాష్టీకం.. గుడ్డు అడిగినందుకు విద్యార్థిపై గరిటెతో దాడి   •   తెలంగాణ ఉద్యమాన్ని కించపర్చింది రేవంత్ రెడ్డి కాదా?   •   డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •  

ఘనంగా గణిత దినోత్సవం

22-12-2025 05:52 PM

కుమ్రంభీం ఆసిఫాబాద్,(విజయక్రాంతి): శ్రీనివాస రామానుజన్ జయంతిని పురస్కరించుకొని సోమవారం మహాత్మ జ్యోతిరావు పూలే బాలికల గురుకుల పాఠశాలలో గణిత దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. శ్రీనివాస రామానుజన్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించిన ప్రిన్సిపల్ సుకన్య మాట్లాడుతూ... ప్రతి ఒక్కరి జీవిత ప్రయాణంలో గణితశాస్త్రం ముడిపడి ఉంటుందన్నారు. గణిత శాస్త్రంలో ఎన్నో సిద్ధాంతాలు, సూత్రాలు కనిపెట్టి ప్రపంచానికి పరిచయం చేసిన మేధావి శ్రీనివాస రామానుజన్ అని కొనియాడారు.ఆయన మన భారతీయుడు కావడం గర్వకారణమని తెలిపారు.ఈ సందర్భంగా విద్యార్థులు ప్రాజెక్ట్ ను ఎక్స్పరిమెంట్ చేశారు.ఈ కార్యక్రమంలో గురుకుల పాఠశాల ఉపాధ్యాయురాలు, సిబ్బంది విద్యార్థినిలు పాల్గొన్నారు.