16 April, 2026 | 12:02 PM

Breaking News

కామ్రేడ్ పెద్దబ్బాయికు నివాళులర్పించిన పోతినేని సుదర్శన్   •   కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం: ఎనిమిది మంది భక్తులు మృతి   •   మాజీ సర్పంచ్ ను పరామర్శించిన మంత్రి పొంగులేటి   •   స్టేట్ 2వ ర్యాంక్ సాధించిన విద్యార్థినికి ఘన సత్కారం   •   ప్రముఖ గాయని ఆశా భోస్లే మృతి పట్ల లోక్‌సభ సంతాపం   •   డీలిమిటేషన్ పై దేశవ్యాప్తంగా ఉత్కంఠ   •   వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన సర్పంచ్   •   అదృశ్యమైన వ్యక్తి దారుణ హత్య.. పొలాల్లో లభ్యమైన బూడిద, అస్తికలు   •   ఆక్రమణలు తొలగించి అభివృద్ధికి సహకరించండి.   •   జై కిసాన్ రైతు సంక్షేమ సంఘం అధ్యక్షులుగా కొత్త మహేష్   •  

ఎంబీఏ గ్రాడ్యుయేషన్ వేడుకలు

06-01-2026 01:17 AM

సిద్ధార్థ కాలేజీలో నిర్వహణ

హైదరాబాద్, జనవరి 5 (విజయక్రాంతి): సిద్ధార్థ గ్రూప్ ఆఫ్ ఇన్‌స్టిట్యూషన్స్ లో ఎంబీఏ గ్రాడ్యుయేషన్ వేడుకలు ఘనం గా నిర్వహించారు. కళాశాల చైర్మన్ డా జి. నాగయ్య అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ర్ట ఉన్నత విద్యా మండలి మాజీ చైర్మన్ ప్రొఫెసర్ ఆర్ లిబాద్రి హాజరై మాట్లాడుతూ.. మేనేజ్‌మెంట్ విద్యార్థులు నాయకత్వ లక్షణాలు, నైతిక విలువలు అలవరచుకుని సమాజానికి ఉపయోగపడే విధంగా ముందుకుసాగాలని సూచించారు.

గౌరవ అతిథులుగా ఉస్మానియా విశ్వవిద్యాలయం మాజీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ సత్యనారాయణ, ప్రొఫెసర్ ఆర్ నాగేశ్వర్ రావు పాల్గొని విద్యార్థులను అభినందించారు. కళాశాల ప్రిన్సిపాల్ డా ఎం కవిత మాట్లాడుతూ.. పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా నాణ్యమైన మేనేజ్‌మెంట్ విద్య అందించడమే సంస్థ లక్ష్యమని తెలిపారు. కార్యక్రమంలో విజయా పీజీ కాలేజ్ ప్రిన్సిపాల్ డా. కె ప్రతాప్ పాల్గొని విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు. వేడుకల్లో ఎంబీఏ పూర్తిచేసుకున్న విద్యార్థులకు గ్రాడ్యుయేషన్ సర్టిఫికెట్లు అందజేశారు.