15 April, 2026 | 1:17 PM

Breaking News

టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యుడుగా షాద్‌నగర్ మాజీ ఎమ్మెల్యే బక్కని నరసింహులు   •   మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •  

ఆరోగ్య సేవలు బలోపేతం దిశగా చర్యలు

26-12-2025 12:21 AM

జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్

చిన్న శంకరం పేట(చేగుంట), డిసెంబర్ 25 :ఆరోగ్య సేవలు బలోపేతం చేసే దిశగా జిల్లాలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను నిరంతర తనిఖీ నిర్వహించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. గురువారం కలెక్టర్ శంకరంపేట ఆర్ మండలంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ పరిశీలించారు. పీహెచ్ సీలోని హాజరు పట్టికను తెప్పించుకుని పరిశీలించారు. ప్రతి రోజు ఇన్ పేషెంట్లు అవుట్ పేషెంట్లు ఎంత మంది వస్తున్నారు.

మందులు అందుబాటులో ఉన్నాయా తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో వైద్య సేవలను మెరుగుపరచడం మరియు సిబ్బంది జవాబుదారీతనం పెంచడం ఈ సందర్శనల ప్రధాన ఉద్దేశ్యం అని అన్నారు. ఈ కార్యక్రమంలో మెడికల్ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.