15 June, 2026 | 9:01 PM

Breaking News

ఘనంగా ఉప ముఖ్యమంత్రి భట్టి జన్మదిన వేడుకలు   •   విద్యార్థులకు ఉచిత నోటు పుస్తకాలు పంపిణీ   •   ఆర్థిక పరిస్థితులను బాగు చేసింది ముఖ్యమంత్రి   •   గ్రామపంచాయతీ కార్మికులకు పీఎఫ్, ఈఎస్ఐ, ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలి   •   అర్హులకే రేషన్ కార్డు.. ప్రభుత్వ ఉద్యోగుల కార్డులు తొలగించాలి   •   మండలంలోని పలు గ్రామాల కాంగ్రెస్ అధ్యక్షుల ఎన్నిక   •   సమ్మె విరమిస్తున్నాం... యధావిధిగా పనులు   •   అధికారులను సమన్వయం చేసుకోలేని దద్దమ్మ రేవంత్ రెడ్డి   •   రెడ్లకుంట ప్రభుత్వ పాఠశాలలో ఘనంగా 'బడి బాట'   •   హుస్నాబాద్ ఇంజనీరింగ్ కళాశాలలోనే భవిష్యత్తుకు బలమైన పునాది!   •  

తెలుగునాట గత వైభవం

26-12-2025 02:01 AM

కాలాలు, గత వైభవాల చుట్టూ రూపుదిద్దుకున్న సినిమా ‘గతవైభవం’. మరో ఏడాది కాలగర్భంలో కలిసిపోతున్న సందర్భంలో తెలుగు నాట విడుదలై, కొత్త సంవ త్సరం సందర్భంగా ఇక్కడి ప్రేక్షకులకు సరికొత్త అనుభూతి పంచనుంది. గత నెలలో కర్ణాటక వ్యాప్తంగా థియేటర్లలో విడుదలైన ఈ చిత్రాన్ని కే నిరంజన్‌రెడ్డి, చైతన్యరెడ్డి నేతత్వంలోని ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్ జన వరి 1న తెలుగులో రిలీజ్ చేయనుంది. 

ప్రేమ, పురాణం, పునర్జన్మ, చారిత్రక నాట కం కలగలిసిన ఈ సినిమాలో ఎస్‌ఎస్ దుష్యంత్, ఆషిక రంగనాథ్ నాయకానాయికలు. సర్వేగర సిల్వర్ స్క్రీన్స్‌తో కలిసి సునీ సినిమాస్ బ్యానర్‌పై రూపుదిద్దుకుంది. సునీ దర్శకత్వం వహించడమే కాకుండా, దీపక్ తిమ్మప్పతో కలిసి ఈ చిత్రానికి సహ నిర్మాతగానూ వ్యవహరించారు. ఈ చిత్రానికి జుడా శాండీ సంగీతం సమకూర్చగా, విలియం జే డేవిడ్ డీవోపీని అందించారు. శివకుమార్, ఉల్లాస్ హైదర్, రఘు మైసూర్ ప్రొడక్షన్ డిజైనింగ్ నిర్వర్తించారు.