12 June, 2026 | 5:35 PM

Breaking News

విశాల ఐక్య ఉద్యమాలకు రైతాంగం ముందుకు రావాలి   •   విద్య అభివృద్ధికి ప్రభుత్వం కృషి: జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్   •   వ్యాధుల నివారణపై దృష్టి సారించండి   •   అంతర్జాతీయ క్రికెట్‌కు కేన్ విలియమ్సన్ వీడ్కోలు   •   శ్రీ సరస్వతీ శిశుమందిర్‌లో గాయత్రి హోమం   •   చిన్న బెండరాలో మాలి సంఘం నూతన కమిటీ ఏర్పాటు   •   జొన్న పంట కొనుగోళ్లలో ప్రజా ప్రభుత్వంపైన రైతులకు భరోసా కలిగింది   •   శ్రీధర్ బాబును విమర్శిస్తే పుట్ట మీ రాజకీయ సమాధికి మేమే పునాది వేస్తాం   •   హైదరాబాద్‌కు ఛత్తీస్‌గఢ్ సీఎం.. స్వాగతం పలికిన మంత్రి ఉత్తమ్   •   వానకాలంలో వేయవలసిన పంటల గురించి రైతులకు అవగాహన   •  

మెల్లకుంటతండా సర్పంచ్ బాల్య నాయక్‌కు ఘన సన్మానం

18-12-2025 01:54 AM

నాగిరెడ్డిపేట్, డిసెంబర్ 17 (విజయ క్రాంతి): మండలంలోని మెల్లకుంట తండా గ్రామ పంచాయతీకి ఎన్నికైన నూతన సర్పంచ్ బాల్యనాయక్ను,మాజీ జడ్పీటీసీల ఫోరం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉమ్మన్నగారి మనోహర్ రెడ్డి శాలువాలతో ఘనంగా సన్మానించారు.

ఈ సందర్భంగా మనోహర్ రెడ్డి మాట్లాడుతూ.... గ్రామ ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని తమ సర్పంచ్ పదవి బాధ్యతను నిబద్ధతతో నిర్వహిస్తూ గ్రామాభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. సమిష్టి కృషితో మెల్లకుంట తండా గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడిపించాలని ఆకాంక్షించారు. ఈ సన్మాన కార్యక్రమంలో  బీఆర్‌ఎస్ నాయకులతో పాటు గ్రామస్తులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు