calender_icon.png 13 December, 2025 | 8:52 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాంగ్రెస్ పార్టీలో జోరుగా చేరికలు

13-12-2025 06:54:02 PM

కాంగ్రెస్ పార్టీలో చేరిన శభాష్ పల్లి వార్డు సభ్యులు,బీజేపీ బిఆర్ఎస్ నాయకులు

ఆహ్వానించిన రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ .

వేములవాడ,(విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ అర్బన్ మండలం(Vemulawada Urban Mandal) శభాష్ పల్లి గ్రామంలో నూతంగా ఎన్నికైన పలువురు వార్డు సభ్యులు,బీజేపీ,బిఆర్ఎస్ నాయకులు శనివారం రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ చేరారు.. ఈ సందర్భంగా వారికి రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కండువా కప్పి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు..