15 April, 2026 | 12:18 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

2వ విడతలో మొత్తం 156 పంచాయితీ..

13-12-2025 06:53 PM

* 17 పంచాయతీలు ఏకగ్రీవం..

* 139 పంచాయతీలకు ఎన్నిక..

ఆదిలాబాద్ (విజయక్రాంతి): జిల్లాలో ఈనెల 14న జరిగే 2వ విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. ఎన్నికల నిర్వహణకు జిల్లా అధికార యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. పోలింగ్, కౌంటింగ్ ప్రక్రియను ప్రశాంతంగా, పకడ్బందీగా నిర్వహించేందుకు పోలీస్ శాఖ గట్టి పోలీస్ బందోబస్తులు ఏర్పాటు చేసింది. 2వ విడతలో ఆదిలాబాద్ రూరల్, బేల, జైనథ్, సాత్నాల, బోరజ్, మావల, భీంపూర్, తాంసి మండలాల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ 8 మండలాల్లో మొత్తం 156 గ్రామ పంచాయతీలు ఉండగా, ఇప్పటికే 17 గ్రామ పంచాయతీలో సర్పంచ్ లు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. దీంతో 139 పంచాయతీలకు 14వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. 

ఆయా మండలాల్లో ఏకగ్రీవమైన పంచాయతీలు..

ఆదిలాబాద్ రూరల్- 4

పెద్దమాలే బోరిగాం, అసోద, అల్లికోరి, అత్తిగుట్ట బేలలో-1 

చాంద్ పల్లి, జైనథ్ లో-1

అడ, బోరజ్ లో-1

పూసాయి, భీంపూర్ లో-5  

మార్క గూడ, జల్ కోరి, కరుణ్ వాడి, టెక్డి రాంపూర్, భగవాన్ పూర్ సాత్నాలలో-2 

పార్డి (బి), జంబుల్ దరి తాంసి లో- 3 లింగుగూడ, అట్నమ్ గూడ, అంబుగాం పంచాయతీల్లో సర్పంచ్ లు ఏకగ్రీవం అయ్యాయి. కాగా మావల మండలంలో ఉన్న 3 పంచాయతీల్లో ఒక్కటి కూడా ఏకగ్రీవం కాలేదు.