15-09-2025 05:20:15 PM
నిర్మల్,(విజయక్రాంతి): ప్రభుత్వ పాఠశాలలో కేజీబీవీ గురుకులాల్లో విద్యార్థులకు ప్రభుత్వం సూచించిన మెనూ ప్రకారం భోజనం పెట్టాలని జిల్లా విద్యాశాఖ అధికారి దర్శనం భోజన్న అన్నారు. సోమవారం సారంగాపూర్ మండలంలోని జామ్ ఎన్జెపి పాఠశాల సోషల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాల కేజీబీవీ పాఠశాలలు పరిశీలించారు . అనంతరం ఉన్నత పాఠశాలను సందర్శించి వంటకాలను పరిశీలించి భోజనంపై వివరాలను అడిగి తెలుసుకున్నారు విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి ఉపాధ్యాయులు పాల్గొన్నారు