17 April, 2026 | 3:13 PM

Breaking News

ఫిల్మ్‌నగర్‌లో ఆయమ్మ దాష్టీకం.. గుడ్డు అడిగినందుకు విద్యార్థిపై గరిటెతో దాడి   •   తెలంగాణ ఉద్యమాన్ని కించపర్చింది రేవంత్ రెడ్డి కాదా?   •   డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •  

ఆదివాసీ విద్యార్థులకు మంత్రి అభినందనలు

22-05-2025 12:00 AM

కుమ్రం భీం ఆసిఫాబాద్ ,మే21(విజయ క్రాంతి): ఇటీవల విడుదలైన పదో తరగతి ఫలితాల్లో ఉత్తమ ఫలితాలు సాధించిన స్థానిక పిటిజి విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచి బుధవారం హైదరాబాద్‌లో మంత్రి సీతక్క, గురుకులాల కార్యదర్శి  సీతా లక్ష్మీ, కమిషనర్ శరత్‌ల చేతులమీదుగా ప్రశంసాపత్రాలు అందుకున్నారు.

గురుకులం ప్రిన్సిపల్ కారం భద్రయ్య తెలిపిన వివరాల ప్రకారం జిల్లా కేంద్రంలోని పిటిజి పాఠశాల నుండి విష్ణువర్ధన్, హరవింద్‌లు పదో తరగతిలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన ప్రథమ ద్వితీయ స్థానాలు కైవసం చేసుకున్న నేపథ్యంలో గురుకులం ఆధ్వర్యంలో హైదరాబాద్ లో  ఏర్పాటు చేసిన  సక్సెస్ మీట్ లో మంత్రి ,కార్యదర్శి,కమిషనర్‌లు విద్యార్థులను శాలువాతో సత్కరించి ప్రశంసా పత్రా లు అందజేశారన్నారు. విద్యార్థులను వైస్ ప్రిన్సిపాల్స్ సుజాత, కృష్ణచారి సిబ్బంది అభినందించారు.