17 April, 2026 | 2:46 PM

Breaking News

డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •   సేవ చేయాలనే సంకల్పంతోనే రాజకీయాల్లోకి   •   వేములవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సర్వర్ డౌన్.. నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు   •  

రైతులను ఇబ్బంది పెట్టొద్దు

22-05-2025 12:00 AM

నిర్మల్, మే 21(విజయక్రాంతి): ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో రైతులను ఎవరు ఇబ్బంది పెట్టిన శాఖపరమైన చర్యలు ఉం టాయని బైంసా ఆర్డిఓ ఇన్చార్జ్ డిఎస్‌ఓ కోమల్ రెడ్డి అన్నారు. బుధవారం కుంటల మండల కేంద్రంలో కొనుగోలు కేంద్రాలను సందర్శించి కొనుగోల నిర్వహణపై అధికారులు రైతులతో మాట్లాడారు.

జొన్నల కొనుగోలు అక్రమాలకు పాల్పడుతున్నారని మహారాష్ట్ర జొన్నలకు కొందరు ఇక్కడికి తీసుకువచ్చి బినామీ పేరుతో విక్రయిస్తున్నారని రైతులు అధికారికి ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ చేస్తామని అక్రమాలకు పాల్పడినవారిపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో తాసిల్దార్, అధికారులు పాల్గొన్నారు.