17 April, 2026 | 12:09 PM

Breaking News

హరివంశ్ రాజ్యసభ ఉపసభాపతిగా ఏకగ్రీవం   •   ఏడేళ్లుగా డిప్యూటీ స్పీకర్ పదవి ఖాళీగా ఉంచడంలో అర్థమేంటీ?   •   హన్మకొండ జిల్లా అక్రిడిటేషన్ కమిటీ ఖరారు   •   ఉపాధి హామీ కూలీలకు త్రాగునీటి ఇబ్బంది లేకుండా చూడండి   •   కీలక బిల్లులపై సర్వత్రా ఉత్కంఠ! లోక్‌సభలో 4 గంటలకు ఓటింగ్   •   రేవంత్ రెడ్డి హైబ్రిడ్ ఫార్ములా కాదు.. అది అసదుద్దీన్ ఓవైసీ ఫార్ములా   •   సోనాల మండల కేంద్రంలో నిఘా నేత్రాల ఏర్పాటు   •   డిల్లీ లో వేం నరేందర్ రెడ్డి కి శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే జారె   •   రోడ్డు భద్రతా ప్రమాణాలపై ఐజీ చంద్రశేఖర్ రెడ్డితో సమావేశం   •   వృద్ధుల కోసం వైద్య సేవలు అందించడం ఎంతో అవసరం   •  

ప్రమాదవశాత్తు విద్యుత్ ప్రమాదంతో ఒకరు మృతి

22-05-2025 08:56 PM

బచ్చన్నపేట (విజయక్రాంతి): విద్యుత్ ప్రమాదంలో ఒకరు మృతి చెందిన సంఘటన బచ్చన్నపేట మండల(Bachannapet Mandal) కేంద్రంలోని గురువారం చోటుచేసుకుంది. గ్రామస్తులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... బచ్చన్నపేట మండల కేంద్రానికి చెందిన ఎండి జమాల్ ఇంట్లో శుభకార్యానికి వచ్చి బంధువుడైన ముషీరాబాద్ హైదరాబాద్ పట్టణానికి చెందిన దావత్అలీ ఆలియాబేగం నలుగురు సంతానం కాగా మూడో కుమారుడైన ఎండి అసాద్(15) జమాల్ ఇంటి పైన వాటర్ ట్యాంకులో స్థానానికి నీళ్లు రాకపోవడంతో ఇంటిపైన చూడడానికి వెళ్లి అసాద్ ప్రమాదవశాత్తు 11 కెవి విద్యుత్ తీగలకు తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు.

సంఘటన స్థలానికి స్థానిక ఎస్సై ఎస్.కె హమీద్ చేరుకొని కరెంటు నిలిపి వేయించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జనగామ ఏరియా ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. 11 కెవి విద్యుత్తు లైను ప్రమాదకరంగా తక్కువ ఎత్తులో ఉండటం వల్లే ఈ ప్రమాదం జరిగిందని గత కొన్ని సంవత్సరాలుగా విద్యుత్ అధికారులకు ప్రజా ప్రతినిధులకు గోపాల్ నగర్ గ్రామ ప్రజలు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకున్న నాధుడు లేకపోయాడు.

గత ప్రభుత్వంలో ఎన్నో వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. నేడు ప్రజాపాలనలో కూడా దరఖాస్తు చేసుకోగా దీనిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఈ విద్యుత్తు లైను తొలగించాలి అంటే మూడు లక్షల పై చిలుకు ఖర్చు అవుతుందని గతంలో స్టేట్మెంట్ విద్యుత్ అధికారులు ఇచ్చారు. అంత డబ్బులను ఇచ్చుకునే పరిస్థితిలో కాలనీవాసులు లేరు అంత డబ్బు కట్టలేక కరెంటుతో భయపడుతూ జీవనం కొనసాగిస్తున్నా ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు అధికారులు స్పందించి ఇట్టి ప్రమాదకరమైన విద్యుత్తు లైను ఇక్కడి నుంచి తొలగించాలని గోపాల్ నగర్ గ్రామ ప్రజలు కోరారు.