12 July, 2026 | 3:13 PM

Breaking News

ముంబైలోని తాజ్ హోటల్‌కు బాంబు బెదిరింపు కాల్   •   చింతల బోరి పంచాయతీలో హెల్ప్ డెస్క్ లో పాల్గొన్న ఉప సర్పంచ్.   •   ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని పర్యవేక్షించిన మండల కాంగ్రెస్ పార్టీ కన్వీనర్   •   ఘనంగా శ్రీ హనుమాన్ చాలీసా సామూహిక పారాయణ   •   సీఎం రేవంత్ వ్యాఖ్యలకు నిరసనగా దిష్టిబొమ్మ దహనం   •   ప్రతి వ్యక్తి ఓటరుగా నమోదు చేయించుకోవాలి   •   రూ.339.59 కోట్లతో భువనగిరి–చిట్యాల నాలుగు లేన్ల రహదారికి శంకుస్థాపన.   •   ఈ నెల 14న కళాశాల బంద్ విజయవంతం చేయాలి   •   ప్రజలకు నాణ్యమైన రహదారి, మౌలిక వసతులు కల్పించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యం   •   స్నాప్‌చాట్, ఇన్‌స్టాగ్రామ్ యాప్‌లను కేంద్ర ప్రభుత్వం వెంటనే నిషేదించాలి   •  

భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్న మంత్రి కొండా సురేఖ

29-09-2025 12:05 AM

వరంగల్, సెప్టెంబర్ 28 (విజయక్రాంతి): దేవి శరన్నవరాత్ర మహోత్సవాలలో ఏడవ రోజు భవాని మాతగా అలంకరించిన భద్రకాళి అమ్మవారిని ఆదివారం సాయంకాలం దేవాదాయ ధర్మాదాయ శాఖ కొండ సురేఖ దర్శించుకున్నారు. ఆలయానికి విచ్చేసిన మంత్రికి దేవాలయ చైర్మన్ డాక్టర్ శివ సుబ్రహ్మణ్యం, ధర్మకర్తలు తొనుపునూరి వీరన్న, కటకం రాములు, గాదె శ్రవణ్ కుమార్ రెడ్డి, ఓరుగంటి పూర్ణచందర్, తొగరు క్రాంతి, బింగి సతీష్, మోత్కూరు మయూరి,

గాండ్ల స్రవంతి, నార్ల సుగుణ పాలడుగుల ఆంజనేయులు, జారతి వెంకటేశ్వర్లు, అనంతుల శ్రీనివాసరావు, మూగ శ్రీనివాసరావు, ఈవో రామల సునీత అర్చకులు భద్రకాళి శేషు పూర్ణకుంభంతో మంగళ వాయిద్యాలతో ఘనంగా స్వాగతం పలికారు. పూజానంతరం ఆలయ స్నపన మండపంలో మంత్రి కొండా సురేఖకు అర్చకులు వేద పండితులు మహదాశీర్వచనం నిర్వహించి అమ్మవారి శేష వస్త్రాలు బహూకరించి ప్రసాదములు అందజేశారు. అనంతరం దేవాలయంలో నిర్వహింపబడుతున్న సాంస్కృతిక కార్యక్రమాలలో చిన్నారులను మంత్రి అభినందించారు.