21-07-2024 05:46:14 PM
హైదరాబాద్: ఇటీవల అనారోగ్యానికి గురైన ప్రముఖ కవి,పాటల రచయిత , గాయకుడు జయరాజ్ ని మంత్రి పొన్నం ప్రభాకర్ నిమ్స్ ఆసుపత్రిలో పరామర్శించారు. జయరాజ్ ఆరోగ్య పరిస్థితిపై మంత్రి డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. వారి కుటుంబ సభ్యులను పరామర్శించి దైర్యం చెప్పారు. జయరాజ్ త్వరగా కోలుకుని బయటకు రావాలని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆకాంక్షించారు.