16-08-2025 12:57:08 AM
కరీంనగర్,ఆగ15(విజయక్రాంతి): స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా కరీంనగర్లో జరిగిన కార్యక్రమంలో తెలంగాణ ఇన్నోవేషన్ సెల్ (టీజీఐసీ) యొక్క 18 మంది గ్రామీణ ఆవిష్కర్తలను సత్కరించింది. ఐటి శాఖ మంత్రి . దుద్దిళ్ల శ్రీధర్ బాబు చేతుల మీదుగా వీరికి ఇన్నోవేటర్ ఐడి కార్డులు అందించారు.
ఈ సందర్భంగా ఇన్నోవేటర్లు తమ ఆలోచనలను అంకుర సంస్థలుగా మార్చి, సమాజంపై సానుకూల ప్రభావాన్ని చూపిన తీరును కొనియాడారు.ఈ కార్యక్రమానికి కరీంనగర్ జిల్లా కలెక్టర్ శ్రీమతి పమేలా సత్పథి (ఐఏఎస్), టీజీఐసీ సీఈఓ మీరాజ్ ఫాహీమ్ వంటి ప్రముఖులు హాజరయ్యారు.