07-01-2026 12:07:39 AM
అలంపూర్, జనవరి 6: అయిజ మండలం వెంకటాపూర్ గ్రామంలో విద్యుత్ సబ్స్టేషన్ సమీపంలో మంగళవారం మిషన్ భగీరథ పైప్లైన్ లీక్ కావడంతో త్రాగునీరు వృథా అవుతోంది. స్థానికులు ఈ విషయాన్ని గుర్తించి అధికారులు వెంటనే స్పందించి పైప్లైన్ను మరమ్మతు చేయాలని కోరుతున్నారు. నీరు వృధా కావడంతో కొని గ్రామాల ప్రజలు నీటి కొరకు ఇబ్బంది పడ్డారు.