17 April, 2026 | 3:17 PM

Breaking News

ఫిల్మ్‌నగర్‌లో ఆయమ్మ దాష్టీకం.. గుడ్డు అడిగినందుకు విద్యార్థిపై గరిటెతో దాడి   •   తెలంగాణ ఉద్యమాన్ని కించపర్చింది రేవంత్ రెడ్డి కాదా?   •   డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •  

చేప పిల్లలను చెరువులో విడుదల చేసిన ఎమ్మెల్యే బాలు నాయక్

17-11-2025 05:43 PM

దేవరకొండ (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఉచిత చేపపిల్లల విడుదల కార్యక్రమంలో భాగంగా సోమవార నల్లగొండ జిల్లా మత్స్య శాఖ ఆధ్వర్యంలో చింతపల్లి మండల కేంద్రంలోని పెద్ద చెరువులో 0.94 లక్షల చేపపిల్లలను దేవరకొండ శాసనసభ్యులు బాలునాయక్ విడుదల చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఉచిత చేపపిల్లల పంపిణీ కార్యక్రమం గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసే దిశగా ఒక అభ్యున్నతి కార్యక్రమం అని తెలిపారు.

మత్స్యకార కుటుంబాల ఆదాయాన్ని పెంచడమే కాకుండా, స్థానిక చెరువుల జీవవైవిద్యాన్ని పెంపొందించడంలో ఈ చేపపిల్లల విడుదల కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. చింతపల్లి పెద్ద చెరువు చేపసంపద అభివృద్ధికి అనువైన వనరుగా మారడం చాలా సంతోషకరం అని అన్నారు. భవిష్యత్తులో కూడా మత్స్యకారులకు ప్రభుత్వం నుంచి అవసరమైన సహాయం అందేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో మత్స్య శాఖ అధికారులతో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, యువజన కాంగ్రెస్ నాయకులు, గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.