15-11-2025 12:00:00 AM
పటాన్ చెరు, నవంబర్ 14 పటాన్ చెరు డివిజన్ పరిధిలోని శాంతినగర్ కాలనీలో గల శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయంలో శుక్రవారం నిర్వహించిన ఆలయ వార్షికోత్సవ కార్యక్రమంలో పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సం దర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. భగవంతుని ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయకుమార్, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.