27 March, 2026 | 2:47 PM

Breaking News

భార్యను హత్య చేసిన వ్యక్తికి జీవిత ఖైదు   •   గంజాయి విక్రయిస్తున్న ముగ్గురు అరెస్ట్   •   భద్రాచలం ఆలయ అభివృద్ధి పనులకు సీఎం భూమిపూజ   •   నేపాల్‌ ప్రధానిగా బాలేంద్ర షా.. పగ్గాలు చేపట్టిన అతిపిన్న వయస్కుడు   •   శ్రీశైల క్షేత్రంలో వైభవంగా సీతారాముల కల్యాణం.!   •   దేశంలో తగినంత ఎరువుల నిల్వలున్నాయి, ఆందోళన చెందాల్సిన అవసరం లేదు — నడ్డా   •   బాలుడి కన్ను గుడ్డు పీకేసిన వీధి కుక్కలు   •   భారత్‌లో మళ్లీ లాక్‌డౌన్‌?.. కేంద్రమంత్రి సంచలన ప్రకటన   •   రాజాసింగ్ ఆధ్వర్యంలో శ్రీరామనవమి శోభాయాత్ర.. ధూల్‌పేటలో ప్రారంభం   •   భద్రాచలంలో కన్నులపండువగా సీతారాముల కల్యాణోత్సవం   •  

దేవాలయ ఆవరణలో వంట గదిని ప్రారంభించిన ఎమ్మెల్యే

28-07-2025 10:05 PM

పటాన్ చెరు: పటాన్ చెరు డివిజన్ పరిధిలోని మహదేవుని ఆలయంలో దాతల సహకారంతో నూతనంగా నిర్మించిన వంటగదిని సోమవారం ఉదయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి(MLA Gudem Mahipal Reddy) ప్రారంభించారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, స్వామివారి కరుణాకటాక్షాలతో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయ్ కుమార్, గూడెం మధుసూదన్ రెడ్డి, ప్రతాప్ గౌడ్, కంకర శ్రీను, వెంకటేష్, శంకర్, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.