04-05-2025 08:51:19 PM
మహబూబాబాద్ (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని కిరాణా వర్తక సంఘం భవనంలో పట్టణ కిరాణం, జనరల్ వర్తక సంఘం ఎన్నికలు ఆదివారం హోరాహోరీగా సాగాయి. ఈ ఎన్నికల్లో అధ్యక్షునిగా సోమరత్న శేఖర్ ఘన విజయం సాధించారు. ప్రధాన కార్యదర్శిగా బద్రీనాథ్, కోశాధికారిగా గుండా మధురెడ్డి ఎన్నికయ్యారు.