4 July, 2026 | 10:15 PM

Breaking News

అనురాగ్ వార్షిక స్నాతకోత్సవంలో 2,789 మంది విద్యార్థులకు పట్టాలు ప్రదానం   •   హ్యూమన్‌ రైట్స్‌ ఫౌండేషన్‌ రాష్ట్ర కోఆర్డినేటర్ గా సాయి భాను   •   డ్రగ్స్, సైబర్ నేరాలపై విద్యార్థులకు అవగాహన   •   వేములవాడ నాయీ బ్రాహ్మణ అసోసియేషన్‌ నూతన కమిటీ   •   పేరం వెంకటేశ్వర రావుకి ఘన సన్మానం   •   నీటి సంపులో పడి చిన్నారి మృతి   •   సీఐ కరుణాకర్ కు జన్మదిన శుభాకాంక్షలు   •   కొత్త మోడల్ మార్కెట్‌లో మహిళా వ్యాపారుల కన్నీరు   •   దొడ్డి కొమరయ్య త్యాగం అందరికీ స్ఫూర్తిదాయకం   •   లయన్స్ క్లబ్ నేరేడుచర్ల ఆధ్వర్యంలో పింగళి వెంకయ్య వర్ధంతి, అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలు   •  

స్ట్రీట్ కాజ్ ఆధ్వర్యంలో మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు

04-05-2025 05:15 PM

మహబూబాబాద్ (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని పదవ వార్డు వీరారం తండాలో స్ట్రీట్ కాజ్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో 4.50 లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన ప్యూరిఫైడ్ మినరల్ వాటర్ ప్లాంట్ ను సంస్థ బాధ్యులు కటికనేని నిహాల్ కృష్ణ, నిహాల్ కుమార్, నైమిశా, సునయన, రాహుల్, విశ్వనాధ్ ప్రారంభించారు. తండావాసులకు స్వచ్ఛమైన తాగునీరు అందించాలని లక్ష్యంతో మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. అలాగే 40 గృహాలకు కవితమ్మ హరితమ్మ టీం సభ్యులు వాటర్ క్యాన్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో బానోతు రాము, హత్తి రామ్ నాయక్, శంకర్ నాయక్, లచ్చిరాం నాయక్ దేవుల, గణేష్, రాజేష్, లక్ష్మణ్, సంపత్, అంజి, ప్రశాంత్, అజయ్ కుమార్, యాకన్న తదితరులు పాల్గొన్నారు.