15 April, 2026 | 12:52 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

గ్రంథాలయ వారోత్సవాల్లో ఎమ్మెల్యే రోహిత్‌రావు

20-11-2025 12:29 AM

మెదక్, నవంబర్ 19(విజయక్రాంతి):57వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా 6వ రోజు ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు ముఖ్యఅతిథిగా పాల్గొని మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఇందిరాగాంధీ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పాత నాణేల సేకరణ ఎగ్జిబిషన్ తిలకించి సంతృప్తి వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే రోహిత్ రావు మాట్లాడుతూ మహిళల విజయాలను గుర్తించడం, వారికి సమానత్వం గురించి అవగాహన కల్పించడం దీని ముఖ్య ఉద్దేశ్యమన్నారు. గ్రంథాలయ వారోత్సవాల్లో మహిళా దినోత్సవాన్ని నిర్వహించడం అనేది ఒక సంప్రదాయంగా వస్తుందని, ఇది గ్రంథాలయాలలో మహిళల పాత్ర, ప్రాముఖ్యతను గుర్తించడం కోసం చేస్తారని చెప్పారు. ఈ కార్యక్రమంలో మెదక్ ఆర్డీవో రమాదేవి, జిల్లా గ్రంథాలయ చైర్మన్ చిలుముల సుహాసిని రెడ్డి, కార్యదర్శి వంశీకృష్ణ, సిబ్బంది జె.యాదగిరి పాల్గొన్నారు.