15 June, 2026 | 11:45 PM

Breaking News

భారీ ఈదురుగాలులకు పారాబాయిల్డ్ రైస్ మిల్ ధ్వంసం   •   చిన్నారి పిల్లల రక్షణ కే బేబీ కేర్: ఎంపీ గోడం నగేష్   •   250 గ్రాముల గంజాయితో యువకుడు అరెస్ట్   •   వడ్డెర సంఘం అధ్యక్షుడిగా కొమ్మరాజుల సురేష్   •   ఆటోను ఢీకొట్టిన ఇసుక లారీ   •   నకిలీ విత్తనాల దందాను అడ్డుకున్నందుకే హత్యాయత్నం..?   •   పెద్దపల్లి జిల్లా మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడిగా జడల సురేందర్ ఏకగ్రీవం   •   కామారెడ్డి జిల్లాలో బీఎల్ఏ, సర్ మ్యాపింగ్ 90 శాతం పూర్తి   •   ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ప్రాథమిక లక్ష్యం: కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్   •   ఉద్యానవన పంటల సాగు విస్తీర్ణం పెంచాలి: జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా   •  

సంపత్ కుమార్ ను సన్మానించిన ఎమ్మెల్యే విజయ రమణారావు

18-10-2025 03:01 PM

సుల్తానాబాద్,(విజయక్రాంతి): సుల్తానాబాద్ మండలం గట్టెపల్లిగ్రామానికి చెందిన సంపత్ కుమార్ ను పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు అభినందిస్తూ సన్మానం చేశారు... ఇటీవల  హైదరాబాద్ రవీంద్రభారతిలో వైద్యుల గ్లోబల్ ఫౌండేషన్ వారు ఏర్పాటుచేసిన కార్యక్రమంలో కాళోజి జాతీయ సాహిత్య పురస్కారం 2025 అవార్డు సంపత్ కుమార్ అందుకున్నారు. దీన్ని పురస్కరించుకొని శనివారం శివపల్లి గ్రామంలోని ఎమ్మెల్యే నివాసంలో సన్మాన కార్యక్రమం జరిగింది,

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... 52 గ్రంథాల రచయిత సంపత్ కుమార్ కు జాతీయ పురస్కారం రావడం  అభినంద నీయమన్నారు. తెలంగాణ భాష మీద పరిశోధన చేసి గ్రంథాలు రచించాడు. సంపత్ కుమార్ కరాటే, యోగ విద్యలో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన సంపత్ కుమార్  వివిధ రకాలుగా సమాజసేవ లో ఉండడం,  68 సార్లు రక్తదానం చేయటం సంతోషం అని ఎమ్మెల్యే  అన్నారు. అలాగే సంపత్ కుమార్ ను గట్టపల్లి గ్రామానికి చెందిన సుల్తానాబాద్ బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ధనాయక్  దామోదర్ రావు , నాయకులు కొలిపాక పెద్దన్న , మాజీ ఎంపిటిసి శంకర్,  కోడెం అజయ్ ,  ధనాయక్ శ్రీనివాసరావు, నగునూరి వెంకటేశం , ఆవోప జిల్లా కార్యదర్శి పల్లా సురేష్ గ్రామ ప్రజలు హార్షం వ్యక్తం చేస్తూ సంపత్ కుమార్ ను అభినందించారు...