15 April, 2026 | 1:15 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

ఎమ్మెల్సీ యాదవరెడ్డికి పార్టీ మారే ఉద్దేశం లేదు.. రాదు

26-12-2025 12:17 AM
  1. ఆయన పార్టీలో చురుకుగా పనిచేస్తున్నారు

బీఆర్‌ఎస్ గజ్వేల్ మండల పార్టీ అధ్యక్షుడు బెండ మధు

గజ్వేల్, డిసెంబర్ 25: ఉమ్మడి మెదక్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ డాక్టర్ యాదవ రెడ్డికి పార్టీ మారే ఉద్దేశం లేదని, భవిష్యత్తులోనూ రాదని గజ్వేల్ మండలం బిఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షుడు బెండ మధు అన్నారు. గురువారం ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్సీ డాక్టర్ యాదవ రెడ్డి ఇటీవల తెలంగాణ భవన్లో బిఆర్‌ఎస్ అధినేత కెసిఆర్ నిర్వహించిన సమావేశంలో పాల్గొన్నారని, నియోజకవర్గంలోని బిఆర్‌ఎస్ సర్పంచులను సన్మానించడంతోపాటు, పార్టీ మెదక్ లో నిర్వహించిన ఇసుక మాఫియా పై నిరసన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారన్నారు.

ల్లప్పుడూ మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావుల సూచన మేరకు పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తూ నాయకులను కార్యకర్తలను ముందుకు నడిపిస్తున్నారన్నారు. పార్టీలో ఆయన సలహా సూచనలతో నాయకులు కార్యకర్తలు పని చేస్తున్నారని వెల్లడించారు. బిఆర్‌ఎస్ పార్టీకి ఆయన చేసిన సేవలను గుర్తించి కెసిఆర్ ఉమ్మడి మెదక్ జిల్లా ఎమ్మెల్సీగా అవకాశం కల్పించడంతో పాటు భారీ మెజారిటీతో గెలిచేలా చేశారన్నారు. ఇప్పటికీ ఎప్పటికీ కూడా ఎమ్మెల్సీ డాక్టర్ యాదవ రెడ్డి బిఆర్‌ఎస్ పార్టీని విడిచి వెళ్లే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.