1 July, 2026 | 6:38 PM

Breaking News

రైతుల శ్రేయస్సుకు సహకార సంఘాలు కృషి చేయాలి   •   ధూప దీప నైవేద్య అర్చక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా శేషం శ్రీనివాసాచార్యులు   •   ప్రభుత్వ కళాశాలకు కంప్యూటర్ను అందించిన ఎన్నారై భాస్కర్ రెడ్డి   •   నెలరోజుల్లో అర్హులకు ఇండ్లు ఇవ్వకపోతే ఆక్రమిస్తాం   •   గజ్వేల్ ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో విద్యార్థులకు ఉచిత పాఠ్యపుస్తకాల పంపిణీ   •   సింగరేణి ప్రధాన ఆసుపత్రిలో జాతీయ డాక్టర్ల దినోత్సవవేడుకలు-2026   •   ప్రభుత్వ పాఠశాలలకు డ్యుయల్ డెస్క్ బెంచీల పంపిణీ   •   సింగరేణి హెడ్ ఆఫీస్ నందు కేంద్ర కార్మిక సంఘాల నిర్వహించిన మహా ధర్నా విజయవంతం   •   జాతీయ డాక్టర్స్ డే సందర్భంగా పేదలకు ఉచిత వైద్య శిబిరం   •   గీతం 17వ గ్రాడ్యుయేషన్ డే ఆగస్టు 1న   •  

ప్రధానిగా మోదీ.. బీహార్ సీఎంగా నితీశ్ ఏ సీటూ ఖాళీగా లేదు!

30-10-2025 01:21 AM

-రాహుల్ పీఎం కావాలన్న సోనియా ఆశ.. తేజస్వీ సీఎం కావాలన్న లాలూ కోరిక కల్ల

-కేంద్ర మంత్రి అమిత్‌షా

పాట్నా, అక్టోబర్ 29: ‘ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ తన కుమారుడు తేజస్వీయాదవ్‌ను ముఖ్యమంత్రిని చేయాలనుకుంటున్నారు. అలాగే కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియా గాంధీ తన కుమారుడు రాహుల్‌గాంధీని ప్రధానిని చేయాలని ఆశపడుతున్నారు. కానీ.. ప్రధానిగా మోదీ, బీహార్ సీఎంగా నితీశే కొనసాగుతారు. ప్రస్తుతం ఆ రెండు స్థానాలు ఖాళీగా లేవని.. సోనియా, లాలూ ఆశలు ఎప్పటికీ కల్లలుగానే మిగులుతాయి’ కేంద్ర హోం మంత్రి అమిత్‌షా ఎద్దేవా చేశారు.

బీహార్‌లోని బెగుసరాయ్, దర్భంగాలో బుధవారం నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో అమిత్‌షా మాట్లాడారు. లాలా ప్రసాద్ యాదవ్, తేజస్వీయాదవ్ అక్రమార్కులకు అండగా నిలవాలని చూస్తున్నారని, బీహార్ ప్రజలు వారికి ఆ అవకాశం కల్పించొద్దని పిలుపుఇచ్చారు. దేశంలో అక్రమంగా చొరబడి వారిని ఓటర్ల జాబితా నుంచి తొలగించాలంటే, యూఎన్డీయే కూటమి అధికారంలోకి రావాలని పేర్కొన్నారు. ఎన్డీయే ప్రభుత్వం ఉగ్రవాదాన్ని , నక్సలిజాన్ని ఏమాత్రం ఉపేక్షించదని తేల్చిచెప్పారు. ఉగ్రవాదులు పహల్గాంలో పర్యాటకులను పొట్టన పెట్టుకున్న వెంటనే ప్రధాని మోదీ స్పందించి ‘ఆపరేషన్ సిందూర్’ చేపట్టారని గుర్తుచేశారు.