27-07-2025 09:02:04 PM
ఎల్లారెడ్డిపేట (విజయక్రాంతి): ఎటువంటి ప్రభుత్వ అనుమతి లేకుండా ఆదివారం నాడు అక్రమంగా మండలంలోని కోరుట్ల పేట గ్రామం నుండి బొప్పాపూర్ గ్రామం వైపు వస్తున్న మట్టి టిప్పర్ ను పోలీసులు పట్టుకున్నారు. ప్రభుత్వ అనుమతులు లేకుండా మట్టిని తరలిస్తున్న టిప్పర్ డ్రైవర్ వినోద్, రాజన్నపేట గ్రామానికి చెందిన టిప్పర్ యజమాని ఉడుగుల సురేందర్ పై కేసు నమోదు చేసి టిప్పర్ను సీజ్ చేసినట్లు ఎస్సై ఎం.మోతిరాం(SI Mothiram) తెలిపారు.