13 April, 2026 | 12:56 PM

Breaking News

దశాబ్దాల నిరీక్షణకు ముగింపు— మహిళా రిజర్వేషన్ల చట్టంపై ప్రధాని మోదీ   •   వివాహ వేడుకలో తీవ్రవిషాదం— బస్సు, ట్రక్కు ఢీ: ఆరుగురు మృతి   •   మండల ప్రజల సమస్యలు త్వరితగతిన పరిష్కరించండి   •   నోయిడా కార్మికుల నిరసన హింసాత్మకం... వాహనాలకు నిప్పు   •   గ్రామీణ వైద్యులకు షోకాజ్ నోటీసులు జారీ   •   నెట్‌వర్కింగ్ మార్కెటింగ్ ఒత్తిడి: యువకుడి ఆత్మహత్య   •   బాణసంచా కర్మాగారంలో భారీ పేలుడు; కార్మికులు చిక్కుకున్నట్లు అనుమానం?   •   గుజరాత్‌లో భయానక ప్రమాదం! యాత్రికులపైకి ట్రక్కు దూసుకెళ్లి 7 మృతి – అసలు ఏమైంది?   •   కొల్కూర్ గ్రామంలో తొలిసారి క్రికెట్ టోర్నమెంట్ నిర్వహణ   •   ఇంటర్ ఫలితాల్లో రిషి విద్యార్థుల ర్యాంకుల పంట   •  

పెద్దపులి దాడిలో లేగదూడ మృతి

27-07-2025 11:11 PM

ధ్రువీకరించిన అటవీశాఖ అధికారులు..

ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చాటింపు..

బెల్లంపల్లి అర్బన్ (విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా(Mancherial District) కాసిపేట మండలం అటవీ ప్రాంతంలో మరోసారి పెద్దపులి పంజా విప్పింది. ధర్మరావుపేట సెక్షన్ పరిధిలోని వెంకటాపూర్ రోట్టేపల్లి అటవీ శివారులో పెద్దపులి దాడిలో లేక దూడ మృతి చెందిన సంఘటన ఆదివారం వెలుగు చూసింది. ఫారెస్ట్ అధికారులు ఈ ఘటనను ధ్రువీకరించారు. కాసిపేట మండలంలో ఇటీవలనే పులి దాడిలో లేక దూడ మృతి చెందిన సంఘటన మరొక ముందే మరో లేగ దూడను పెద్దపులి బలి తీసుకుంది. మేత కోసం వెళ్ళిన పశువులపై పెద్దపల్లి దాడి దాడి చేసింది. ఈ సంఘటనలో లేక దూడ మృతి చెందింది. లేగదూడ మృతి చెందడంతో మరోసారి ఈ ప్రాంతంలో పులి సంచారం వెలుగు చూసింది.

పులి దాడిలో మృతి చెందిన లేక దూడ గోల్డ్ గూడెంకు చెందిన కురిసెంగ అచ్యుతరావుకి చెందిందని గుర్తించారు. పెద్దపులి దాడి ఘటనను బెల్లంపల్లి అటవీ క్షేత్ర అధికారి పూర్ణచందర్ ధ్రువీకరించారు. లేగ దూడ యజమానికి నష్టపరిహార చెల్లిస్తామని  తెలిపారు.  అటవీ ప్రాంతంలోకి పశువుల కాపరులు సమీప పంట చేనులో పనికి వెళ్లేవారు అప్రమత్తంగా ఉండాలని ఆయన హెచ్చరించారు. పెద్దపులికి సంబంధించిన ఆనవాళ్లు కనిపిస్తే  అటవీ శాఖ వారికి వెంటనే ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని కోరారు. పెద్దపులి సంచరిస్తున్న సమీప గ్రామాలలో డప్పు చాటింపును చేయించడం జరిగిందని తెలిపారు. అటవీ శివారు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. లేగ దూడ చనిపోయిన ఘటన ను ఫారెస్ట్ అధికారులు సందర్శించారు.