calender_icon.png 1 October, 2025 | 11:44 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యాభివృద్ధిలో దూసుకుపోతున్న ములుగు

01-10-2025 10:44:42 PM

హనుమకొండ/ములుగు (విజయక్రాంతి): కేంద్ర ప్రభుత్వ సహాయ, సహకారాలతో విద్యాభివృద్ధిలో ములుగు జిల్లా దూసుకుపోతుందని బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి నగరపు రమేష్ అన్నారు. హనుమకొండ కాకతీయ హోటల్లో ఏర్పాటు చేసిన సమావేశంలో రమేష్ మాట్లాడుతూ, గత 11 ఏళ్లుగా తెలంగాణలో విద్యాభివృద్ధికి అన్నిరకాలుగా సహకరిస్తున్న కేంద్ర ప్రభుత్వం తాజాగా మరో 4 కేంద్రీయ విద్యాలయాలను కేటాయించిందని, ఇప్పటికే ఉన్న 35 కేంద్రీయ విద్యాలయాలకు తోడుగా ఈ నాలుగు విద్యాలయాలు మారుమూల ప్రాంతాల్లోనూ నాణ్యమైన ప్రాథమిక, సెకండరీ విద్యను అందించడంలో కీలకం కానున్నాయన్నారు. తెలంగాణలో విద్యాభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తున్నందుకు ప్రధానమంత్రి నరేంద్రమోదీకి, కేంద్ర విద్యాశాఖ మంత్రి  ధర్మేంద్ర ప్రధాన్ కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.

గతంలో సమ్మక్క సారక్క గిరిజన యూనివర్సిటీని, అదేవిధంగా రాబోయే విద్యా సంవత్సరానికి గాను ములుగు జిల్లా కేంద్రంలో కేంద్రీయ విద్యాలయాన్ని మంజూరు చేసిందని, అదేవిధంగా తెలంగాణకు మంజూరైన కేంద్రీయ విశ్వవిద్యాలయాలు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రం, జగిత్యాల జిల్లా - జగిత్యాల రూరల్ మండలం - చెల్గల్, వనపర్తి జిల్లా- నాగవరం శివార్ ఇవి కాకుండా, గత రెండేళ్లలోనే కేంద్ర ప్రభుత్వం తెలంగాణలో నాణ్యమైన సెకండరీ విద్యను అందించేందుకు రూ.400 కోట్లతో 832 పీఎం-శ్రీ స్కూల్స్‌ను మంజూరు చేసింది. దేశవ్యాప్తంగా పీఎంశ్రీ స్కూల్స్ కోసం ఎక్కువ కేటాయింపులు అందుకున్న రాష్ట్రం తెలంగాణనే కావడం విశేషం అన్నారు.

ఇవే కాకుండా సమగ్రశిక్షా అభియాన్ కింద గత రెండేళ్లలో తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం.. దాదాపు రూ.2వేల కోట్లను కేటాయించిందన్నారు. దాదాపు వెయ్యికోట్లతో నూతన భవనాల నిర్మాణానికి సమ్మక్క, సారక్క సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీకి కేంద్ర ప్రభుత్వం కేటాయించిందన్నారు. అనంతరం ములుగు జిల్లా కేంద్రంలో నూతనంగా కేంద్రీయ విద్యాలయ మంజూరుకు సహకరించిన కేంద్ర మంత్రులు, కిషన్ రెడ్డి, బండి సంజయ్ కుమార్, ఎంపీ ఈటెల రాజేందర్, మాజీ రాజ్యసభ సభ్యుడు గరికపాటి మోహన్ రావులకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేశారు.