01-10-2025 10:41:53 PM
అయిత పరంజ్యోతి..
చేగుంట (విజయక్రాంతి): విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని మండల పట్టణ ప్రజలకు ప్రముఖ సంఘ సేవకులు, జిల్లా వాలీబాల్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు అయిత పరంజ్యోతి దసరా శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా తాను మాట్లాడుతూ చెడుపై మంచి సాధించిన విజయాన్ని గుర్తుచేస్తూ, ప్రజలు పండుగను ఆనందోత్సవాలతో జరుపుకోవాలని.. ప్రజలందరూ సుఖసంతోషాలతో, సుభిక్షంగా ఉండాలని పేర్కొన్నారు. ప్రజలందరూ సుఖశాంతులతో, సిరిసంపదలతో ఆనందంగా ఉండాలని ఆకాంక్షించారు. పండుగను ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని, ఈ దసరా ప్రజల జీవితాల్లో కొత్త వెలుగులు నింపాలని అన్నారు.