16 April, 2026 | 2:36 PM

అక్రమంగా గోవుల తరలింపు.. పట్టుకున్న పోలీసులు

30-05-2025 12:52 AM

తూప్రాన్, మే 29 :తూప్రాన్ మున్సిపల్ పరిధిలోని పోతురాజు పల్లి సమీపంలో గోవులను అక్రమంగా తరలిస్తుండగా అందిన సమాచారం మేరకు పోలీసులు చేరుకొని ఆవులను తరలిస్తున్న డీసీఎం ను పట్టుకొన్నారు. 

డీసీఎం లో పరిశీలించగా 35 నుండి 40 వరకు గోవులు ఉన్నాయి, డీసిఎం డ్రైవర్ ను ఆరా తీయగా గజ్వేల్ నుండి తీసుకురావడం జరిగిందని తెలుపగా తూప్రాన్ ఎస్‌ఐ శివానందం, పోలీస్ సిబ్బంది మాసాయిపేట మండలం రామంతపూర్ లో ఉన్న గోసంరక్షణ శాలకు వాటిని తరలించారు.