15 April, 2026 | 12:39 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

ఉద్యాన కళాశాలలో జాతీయ రాజ్యాంగ దినోత్సవ వేడుకలు

26-11-2025 10:21 PM

పెద్దమందడి: పెద్ద మందడి మండల పరిధిలోని ఉద్యాన కళాశాల నందు జాతీయ సేవా పథకం తరపున యన్.ఎస్.ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్లు కె. భాస్కర్, నవ్యశ్వేత ఆధ్వర్యంలో జాతీయ రాజ్యాంగ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కళాశాలలోని ప్రతి విద్యార్థి ఉద్యాన విద్యతో పాటుగా తప్పకుండా రాజ్యాంగాన్ని చదవాలి అని భాస్కర్ సూచించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు రాజ్యాంగం యొక్క ప్రాముఖ్యత, విలువల గురించి ఉపన్యాస పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు ఇంచార్జ్ అసోసియేట్ డీన్ డా. షహనాజ్ చేతుల మీదుగా అందించారు. మన దినసరి జీవితంలో మన రాజ్యాంగం మనకు ఎంతో తోడ్పడుతుంది, ప్రతి ఒక్కరు రాజ్యాంగం గురించి తెలుసుకోవాలని ఆమె తెలిపారు. అనంతరం రాజ్యాంగం గురించి విద్యార్థులచే ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రొఫెసర్లు డా.మాధవి, అశ్విని, దీపిక, నాన్ టీచింగ్ స్టాఫ్ అబ్రహాం, జయమ్మ, రేణుక మరియు విద్యార్థులు పాల్గొన్నారు.