13 May, 2026 | 11:15 PM

Breaking News

మల్లెపల్లి వడ్ల కేంద్రంలో భారీ కుంభకోణంలో సీబీసీఐడీ విచారణ చేపట్టాలి   •   బక్రీద్ కు ప్రత్యేక చర్యలు చేపట్టాలి   •   బోధన్ పట్టణంలో గంజాయి నేరస్తుడు పట్టివేత   •   గ్రామీణ రహదారుల నిర్మాణంతోనే నిజమైన అభివృద్ధి సాధ్యం: కూనంనేని   •   ఆత్మకూరులో ఘనంగా శ్రీమరకత ఆత్మలింగేశ్వర స్వామి దివ్య ప్రతిష్ట మహోత్సవం   •   గ్రామాల్లో మౌలిక వసతులు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం   •   తూప్రాన్ టోల్ ప్లాజా వద్ద తనిఖీలు చేసిన జిల్లా ఎస్పీ డివి శ్రీనివాసరావు   •   సుల్తానాబాద్ కోర్టుకు హాజరైన బిజెపి నాయకులు   •   భూలక్ష్మి మహాలక్ష్మి అమ్మవార్ల ఆశీస్సులతో ప్రజలంతా సుఖ సంతోషాలతో జీవించాలి   •   ప్రేమ పేరుతో యువతిని నమ్మించి మోసం చేసిన యువకుడు   •  

రోడ్డు నిర్మించాలని వినూత్నంగా నిరసన

08-09-2025 07:11 PM

బెల్లంపల్లి,(విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా కాసిపేట మండలంలోని కొండాపూర్ చౌరస్తా (యాప) వద్ద నూతనంగా రోడ్డు నిర్మాణం చేపట్టాలని మాది హక్కుల దండోరా సంఘం కాసిపేట అధ్యక్షులు అటకపురం రమేష్ సోమవారం డిమాండ్ చేస్తూ అద్వానంగా తయారైన రోడ్డుపై ప్లకార్డుతో నిరసన తెలిపారు. రోడ్డుపై ఏది ధరించక పోయిన ఫైన్ విధించే అధికారులు అసలు రోడ్లనే పట్టించుకోకపోతే తనకు ఎంత ఫైన్ కడతారో తెలపాలని వినూత్నంగా రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. రోడ్డు పూర్తిగా కుంగిపోయిన ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. దేవాపూర్ లో యూనియన్ ఎలక్షన్ జరిగితే ప్రచారానికి వచ్చిన ఎమ్మెల్యే వినోద్ తన పార్టీ అభ్యర్థి గెలవాలని ప్రయత్నించాడు. తప్ప రోడ్డు పట్టించుకోలేదని ఆరోపించారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్పందించి కొండాపూర్ యాప వద్ద నూతన రోడ్డు నిర్మాణానికి కృషి చేయాలని కోరారు.