12 May, 2026 | 11:16 PM

Breaking News

భధ్రాచలంలో ఘనంగా హనుమాన్‌ జయంతి వేడుకలు   •   హనుమాన్ సేన ఆధ్వర్యంలో ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు   •   వృద్ధురాలి ఇళ్ళు కబ్జాకు యత్నం... న్యాయం చేయాలని వేడుకోలు   •   టి దుకాణాలలో స్మోకింగ్ జోన్లను ఎత్తివేయండి   •   గంజాయి కేసులో నలుగురిపై కేసు.. డి-అడిక్షన్ సెంటర్‌కు తరలింపు   •   మంత్రి తుమ్మల పేరున ప్రత్యేక ప్రార్థనలు జరిపిన దమ్మపేట ముస్లిం మైనారిటీ నాయకులు   •   వికె సీఎం ఫిట్ కమిటీ సమావేశం   •   సమ్మర్ క్యాంప్ ఆకస్మిక తనిఖీ   •   పదో తరగతి సప్లమెంటరీ విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ తరగతులు ప్రారంభం   •   ప్రభుత్వ స్థలాల్లో అక్రమ నిర్మాణాలు నిర్మిస్తే సహించం   •  

ఓట్ల వ్యత్యాసాలను సరి చేయండి

08-09-2025 09:48 PM

గరిడేపల్లి,(విజయక్రాంతి): గరిడేపల్లి మండలంలో ఇటీవల ప్రకటించిన ఓటర్ల జాబితాలో కొన్ని ఎంపీటీసీ కేంద్రాల పరిధిలో ఓట్ల తేడా ఉందని వాటిని పరిశీలించి తేడాలను సరిచేయాలని మాజీ జెడ్పిటిసి పెండెం శ్రీనివాస్ గౌడ్ తెలిపారు.సోమవారం ఈ విషయంపై మండల పరిషత్ అధికారి సరోజ కు ఆయన వినతిపత్రం అందజేశారు.మండలంలోని పొనుగోడు 1,పొనుగోడు 2,గరిడేపల్లి 1,గరిడేపల్లి 2 ఎంపీటీసీ పరిధిలో ఓట్లలో భారీ తేడా (వ్యత్యాసం) ఉన్నాయని ఆయన తెలిపారు.పొనుగోడు 1 ఎంపిటిసి కేంద్రం పరిధిలో 2837 ఓట్లు ఉన్నాయని,పొనుగోడు 2 ఎంపీటీసీ కేంద్రం పరిధిలో3651 ఓట్లు ప్రకటించిన జాబితాలో నమోదయాయని తెలిపారు.దీంతోపాటు గరిడేపల్లి 1 పరిధిలో 2775 ఓట్లు నమోదు అయ్యాయని,గరిడేపల్లి 2 ఎంపీటీసీ కేంద్రం పరిధిలో 4875 ఓట్లు జాబితాలో నమోదైనట్లు తెలిపారు.సంబంధిత ఎంపీటీసీ కేంద్రాల పరిధిలో ఓట్ల వ్యత్యాసం ఎక్కువగా ఉందని దీనిని గమనించి అన్ని ఎంపీటీసీల పరిధిలో ఓట్లు సమానంగా ఉండేవిధంగా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.