12 May, 2026 | 10:02 PM

Breaking News

భధ్రాచలంలో ఘనంగా హనుమాన్‌ జయంతి వేడుకలు   •   హనుమాన్ సేన ఆధ్వర్యంలో ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు   •   వృద్ధురాలి ఇళ్ళు కబ్జాకు యత్నం... న్యాయం చేయాలని వేడుకోలు   •   టి దుకాణాలలో స్మోకింగ్ జోన్లను ఎత్తివేయండి   •   గంజాయి కేసులో నలుగురిపై కేసు.. డి-అడిక్షన్ సెంటర్‌కు తరలింపు   •   మంత్రి తుమ్మల పేరున ప్రత్యేక ప్రార్థనలు జరిపిన దమ్మపేట ముస్లిం మైనారిటీ నాయకులు   •   వికె సీఎం ఫిట్ కమిటీ సమావేశం   •   సమ్మర్ క్యాంప్ ఆకస్మిక తనిఖీ   •   పదో తరగతి సప్లమెంటరీ విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ తరగతులు ప్రారంభం   •   ప్రభుత్వ స్థలాల్లో అక్రమ నిర్మాణాలు నిర్మిస్తే సహించం   •  

పాఠశాలలో నిధుల అవకతవకలపై ప్రజావాణిలో ఫిర్యాదు

08-09-2025 09:51 PM

చిన్నశంకరంపేట/చేగుంట(విజయక్రాంతి): చిన్నశంకరంపేట మండలంలోని ప్రజావాణి కార్యక్రమంలో పాఠశాల నిధుల అవకతవకలపై చందంపేట గ్రామపంచాయతీ మాజీ వార్డ్ మెంబర్ నాయిని ప్రవీణ్ కుమార్ ఫిర్యాదు చేశారు.చిన్నశంకరంపేట మండలం చందంపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో ఉన్న ప్రమాదకరమైన చెట్లను 35,000లకు అక్షరాల ముప్పై ఐదువేల రూపాయలకు అమ్మేసారు. ఇట్టి డబ్బులు పాఠశాల ప్రధానోపాధ్యాయుని వద్ద ఉన్నాయి.

గ్రామస్తులు ఆగస్టు 15న రోజున పాఠశాలలోని సమావేశంలో నాయిని ప్రవీణ్  డబ్బుల లెక్క అడుగుతే ప్రధానోపాధ్యాయుడు స్పందించలేదని, చెట్లను అమ్మిన డబ్బులు ఎవరు వాడుకున్నారో చెప్పమని అడుగుతే, సమాధానం ఇవ్వడంలేదని ఆయన పేర్కొన్నారు. ఈ విషయమై తాసిల్దార్ మాలతికి నాయిని ప్రవీణ్ కుమార్ వినతి పత్రం అందించగా మండల విద్యాధికారి పుష్ప వేణికి దీనిపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాల్సిందిగా వ్రాతపూర్వకంగా రాసిచ్చారు.