30 June, 2026 | 9:52 PM

Breaking News

పెంచికల్‌పేట్ పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన ఎస్పీ   •   మండల అధ్యక్షులుగా అంకం శ్రీనివాస్   •   రాంకీ డంపింగ్ యార్డ్ తొలగింపే లక్ష్యం   •   రాష్ట్రంలో ఎక్కడ చూసినా కులవివక్షత కొనసాగుతుంది   •   ఉపాధ్యాయులు, ఎస్‌ఎస్‌ఏ సిబ్బంది సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి   •   ఓటరు ఎన్యూమరేషన్ (SIR )పారాలు బిఎల్ఓ యాప్ లో నమోదు చేయాలి   •   దుండిగల్ వార్డులో సీఎంసీ కమిషనర్ శ్రీజన ఐఎఎస్ పర్యటన   •   అక్కంపల్లి గ్రామంలో హరితవనాలు, ఫిట్టింగ్ పనులు పరిశీలించిన డిఆర్డిఓ కుటుంబరావు   •   హనుమాన్ ఆలయంలో చోరీ   •   డీడీఎన్ అర్చక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా బసవలింగప్ప ఎన్నిక   •  

టూరిజం మేనేజ్మెంట్ లో నిమ్మల రాజేష్ కు డాక్టరేట్ ప్రదానం..

19-05-2025 08:11 PM

హనుమకొండ (విజయక్రాంతి): కాకతీయ విశ్వవిద్యాలయం టూరిజం మేనేజ్మెంట్(Kakatiya University Tourism Management) పరిశోధకులు నిమ్మల రాజేష్ కు కాకతీయ యూనివర్సిటీ డాక్టరేట్ ను ప్రకటించింది. హిస్టారికల్ మోనుమేంట్స్ ఇన్ నార్త్ తెలంగాణ ఫర్ ది ప్రమోషన్ ఆఫ్ టూరిజం- ఏ స్టడీ అనే అంశంపై టూరిజం మేనేజ్మెంట్ అండ్ హిస్టరీ ఆచార్యులు తక్కళ్ళపల్లి దయాకర్ రావు పర్యవేక్షణలో పరిశోధనాత్మక సిద్దాంత గ్రంథాన్ని యూనివర్సిటీకి సమర్పించినందుకు గాను డాక్టరేట్ ప్రదానం చేసినట్లు కేయూ పరిక్షల నియంత్రణ అధికారి ప్రొఫెసర్ కట్ల రాజేందర్ ఒక ప్రకటనలో తెలిపారు.

రాజేష్ తొర్రూరు మండలం కంటాయపాలెం గ్రామంలో నిరుపేద కుటుంబమైన నిమ్మల వెంకటేశ్వర్లు-అరుణ దంపతులకు జన్మించారు. స్వయంశక్తితో, పట్టుదలతో చదువుకోని గ్రామంలోనే డాక్టరేట్ పట్టా పొందిన మొదటి వ్యక్తి కావడం విశేషం. అంతేకాదు గత 15 సంవత్సరాలుగా ఎబివిపిలో పనిచేస్తూ జాతీయవాద సిద్దాంతాన్ని విద్యార్థుల్లో పెంపోదిస్తూ దేశంకోసం ధర్మం కోసం సమాజ హితం కోసం నిరంతరం పనిచేస్తున్న రాజేష్ ను ఈ  సందర్భంగా ఆ విభాగం అధ్యాపకులు, పరిశోధకులు, కంఠాయపాలెం గ్రామస్తులు అభినందించారు.