16 April, 2026 | 11:23 PM

Breaking News

సదాశివపేట పట్టణ ప్రజల తాగునీటి సమస్యలపై జగ్గారెడ్డి, నిర్మల సమీక్ష   •   గురుకుల విద్యాలయాలపై నిరంతర పర్యవేక్షణ: కలెక్టర్ బాదావత్ సంతోష్   •   బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలను ఖండించిన హరీశ్‌రావు   •   ముస్లిం రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం: అమిత్ షా   •   పెళ్లి చేసుకుంటానని మహిళపై అత్యాచారం.. బీజేపీ కౌన్సిలర్ కుమారుడిపై కేసు   •   99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికతో సమగ్ర మార్పు తీసుకురావాలి   •   ముదిరాజులు అన్ని రంగాల్లో రాణించాలి   •   మూడు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు   •   ప్రభుత్వం హామీలు అమలు చేయకపోతే.. ఏప్రిల్ 22 నుంచి సమ్మె   •   సమన్వయంతో పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యం   •  

పెద్దపల్లిలో ఘనంగా ఎన్టీఆర్ జయంతి

28-05-2025 01:52 PM

పెద్దపల్లి,(విజయక్రాంతి ): తెలుగు దేశం వ్యవస్థాపకుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దివంగత నందమూరి తారక రామారావు(Nandamuri Taraka Rama Rao) 103 వ జయంతి సందర్బంగా బుధవారం పెద్దపల్లి జిల్లా కేంద్రంలో అయ్యప్ప దేవాలయం చౌరస్తా వద్ద ఎన్టీఆర్ విగ్రహనికి పూలమాలలు వేసి కేకు కట్ చేసిన ఎన్టీఆర్ అభిమానులు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ స్వచ్ఛమైన రాజకీయాలు నడిపిన వ్యక్తి ఎన్టీఆర్ అని, ఉమ్మడి రాష్ట్రానికి ఎన్టీఆర్ చేసిన సేవలను కొనియాడారు, రాబోయే తరాలకు ఎన్టీఆర్ ఆదర్శం అంటూ వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా అభిమానులు జై ఎన్టీఆర్ అంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో ఉప్పు రాజు, రంగు శ్రీనివాస్,ఎన్టీఆర్ అభిమానులు పాల్గొన్నారు.