08-10-2025 12:37:37 AM
కరీంనగర్, అక్టోబర్ 7 (విజయక్రాంతి): కరీంనగర్ డ్రగ్ కంట్రోల్ ఆఫీసులో లంచం తీసుకుంటూ ఇద్దరు అధికారులు, ఓ ప్రైవేటు వ్యక్తి ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. మెడికల్ షాపుల రిన్యువల్ కోసం రూ.20 వేల లంచం తీసుకుంటున్నారన్న సమాచారంపై ఏసీబీ అధికారులు మంగళవారం ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ క్రమంలో లంచం తీసుకుంటున్న అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీనివాస్రావు, డ్రగ్ ఇన్స్పెక్టర్ కార్తిక్ను, వారితో ఉన్న రాము అనే వ్యక్తిని రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు.