17 April, 2026 | 2:52 PM

Breaking News

డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •   సేవ చేయాలనే సంకల్పంతోనే రాజకీయాల్లోకి   •   వేములవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సర్వర్ డౌన్.. నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు   •  

విధి నిర్వహణలో అప్రమత్తంగా ఉండాలి

26-12-2025 12:45 AM

డీఎస్పీ వెంకట్‌రెడ్డి

చారకొండ, డిసెంబర్ 25: విధి నిర్వహణలో పోలీసులు అప్రమత్తంగా ఉండాలని డీఎస్పీ వెంకట్ రెడ్డి అన్నారు. గురువారం మండల పోలీస్ స్టేషన్ ను ఆకస్మికంగా తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పోలీసు స్టేషన్ కు వచ్చే ఫిర్యాదుదారులతో మర్యాదపూర్వకంగా వ్యవహరించి న్యాయం చేయాలన్నారు.

గ్రామాల్లో అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా నిరంతరం నిఘా పెట్టాలన్నారు. విధుల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన పోలీస్ కానిస్టేబుళ్లు సురేష్ గౌడ్, ఎ. ప్రశాంత్ కు డీఎస్పీ రివార్డు అందజేశారు. అనంతరం పోలీస్ స్టేషన్ ఆవరణాన్ని పరిశీలించి మొక్కలు నాటారు. కార్యక్రమంలో సీఐ విష్ణువర్ధన్ రెడ్డి, ఎస్త్స్ర వీరబాబు, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.